
అమరావతి: శ్రావణమాసం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మహిళలకు కానుక ప్రకటించారు. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించారు. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పిఠాపురంలోని శ్రీ పాదగయ కేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం కానున్నాయి.
మొత్తం 5 బ్యాచ్ లకు 5 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఒంటిగంట తర్వాత వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన కూపన్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. కూపన్లపై ఉన్న సమయానికి మహిళలు వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవాలి.