
విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను అలర్ట్ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు వాహనాలతో మంటలార్పారు. బస్సు కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.