భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్ పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడం సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం వంటి కారణాలు ఆజ్యం పోశాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 211.15 పాయింట్ల నష్టంతో 24,500 స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.445 లక్షల కోట్లకు చేరింది.

ట్రంప్ విధించిన 25 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రభావం మన ఎగుమతులపై పడడంతో మన మార్కెట్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 26 న రూ.6500 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గత మూడు వరుస సెషన్లలో వీరు సెల్లర్లుగా కొనసాగుతుండడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది.